న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం ఒకరిదైతే.. తమ్ముడి లాంటి నాయకుడిని ఆశీర్వదించాలనేది మరొకరి ఆకాంక్ష. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కనిపించిన ఈ దృశ్యం పలువురు నెటిజన్ల మనసు దోచుకుంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి వెళ్లినపుడు అక్కడ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉన్నారు. ఆమె తనకంటే ఆరేళ్లు సీనియర్ కావడం, వయసులో పెద్ద కావడంతో కారు దిగి కార్యాలయంలోకి వస్తూనే ఆమెకు వినయంగా తలవంచి ఆయన నమస్కరించారు. వెంటనే తన రెండు చేతులూ గడ్కరీ తలపై ఉంచిన సుష్మ.. ఆయనను మనసారా ఆశీర్వదించారు. తర్వాత భుజమ్మీద తట్టారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా చిరు మందహాసంతో కార్యాలయంలోకి వెళ్లారు. ఇదంతా అక్కడే ఉన్న మీడియా కెమెరాలకు దొరికింది.
ఆ తర్వాత తనపై సుష్మా స్వరాజ్ చూపించిన ఆప్యాయతకు గడ్కరీ కరిగిపోయారు. ‘‘మీ ఆశీస్సులు, ఆప్యాయతకు ధన్యవాదాలు సుష్మా స్వరాజ్ జీ’’ అని ట్వీట్ చేశారు. బీజేపీలోని సీనియర్ నాయకులలో ఒకరు, తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన సుష్మాస్వరాజ్.. ఈసారి మాత్రం అనారోగ్యం కారణంగా ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోనని చెప్పారు. అయితే ఈ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని ఆమె చెప్పారు. గడ్కరీ-సుష్మ ఆశీస్సుల ఘటన బీజేపీ సంస్కృతికి నిదర్శనమని పలువురు కార్యకర్తలు అన్నారు. 2014లో నాగ్ పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విలాస్ విలాస్ ముత్తెంవార్ ను గడ్కరీ 2.84 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఈసారి ఆధిక్యం మరింత పెరుగుతుందని ధీమాగా ఉన్నారు.
#WATCH Delhi: Visuals of External Affairs Minister Sushma Swaraj and Union Minister Nitin Gadkari from outside the BJP headquarters. The leaders had arrived for the party's CEC meeting. pic.twitter.com/7NMXtsH0af
— ANI (@ANI) March 25, 2019
Thank you @sushmaswaraj ji for your blessings and warm wishes. pic.twitter.com/wwQblvmjq8
— Nitin Gadkari (@nitin_gadkari) March 25, 2019