జాతీయ రహదారి దిగ్బంధం
అన్ని పార్టీల నిరసన
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు జాతీయ రహదారుల దిగ్బంధంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పార్టీలకు అతీతంగా నాయకులందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు. సోమ, మంగళవారాల్లో జాతీయ రహదారుల మీద పౌరుల రాకపోకలను నిషేధించారు. దీన్ని రాష్ట్ర ప్రజలెవ్వరూ ఆమోదించకూడదని, ఉల్లంఘించాలని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు. ఎవరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్లాలన్నారు. ఈ నిషేధాన్ని తాము కోర్టులోనూ సవాలు చేస్తామని తెలిపారు.
నిషేధం విషయంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆయన యంత్రాంగం అనుసరిస్తున్న తీరుపై తమ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను ఆమె ట్వీట్ చేశారు. ఇది పాలస్తీనా కాదు.. కశ్మీర్ అని, తమకు ఎంతో ఇష్టమైన ఈ భూమిని బహిరంగ కారాగారంగా మార్చడానికి ఒప్పుకోమని ఆమె అన్నారు.
Protested against Guv admins callous & absurd ban today. How can you restrict civilian movement on our main highway? You want to smother Kashmiris, change the demographics of the state & imprison them in their own land? Over my dead body. pic.twitter.com/y72LUVGhTY
— Mehbooba Mufti (@MehboobaMufti) April 7, 2019
రాష్ట్ర రాజకీయాల్లో మెహబూబా ముఫ్తీ ప్రత్యర్థి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంలో ట్వీట్ చేశారు. నిషేధ నిర్ణయం బుర్రలేనిదని ఆయన అన్నారు. దానివల్ల చాలా అసౌకర్యం కలుగుతుందని చెప్పారు. ఉరీ ప్రాంతానికి వెళ్తుంటే ఈ విషయంలో తనకే అనుభవం అయ్యిందని, బుర్ర లేకుండా ఇలా జాతీయ రహదారిని దిగ్బంధించడం సరికాదని అన్నారు. కశ్మీర్ లో బీజేపీ మాజీ సహచరుడు సజ్జాద్ లోన్ లాంటివాళ్లు కూడా ఈ నిర్ణయాన్ని ఖండించారు. గవర్నర్ వెంటనే నిషేధం ఎత్తేయాలని డిమాండ్ చేశారు. తనకు రాష్ట్రం నలుమూలల నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని, తమ రోజువారీ అవసరాల కోసం వెళ్లాల్సిన ప్రజలు ఇరుక్కుపోతున్నారని చెప్పారు. ఈ అమానవీయ ఉత్తర్వులను గవర్నర్ వెంటనే ఎత్తేయాలని కోరారు.
Mujibur hu ke teri mehfil me aa gaye hai ..Muskil yahi Ab to muskil me aa gaye hai…kaid me hai BULBUL saiyyad muskuraye…kaha bhi na jaye chup raha bhi na jaye … #KashimirCaged #HighwayBan …All hopes @JKNC_ @OmarAbdullah #Dr Sab @ImranNDar pic.twitter.com/TnSpTRQE9R
— Dr.Sheikh Aamina #MaskUpIndia (@Drsheikhamina) April 7, 2019
భద్రతా దళాల మోహరింపు కోసం బారాముల్లా నుంచి ఉదంపూర్ వరకు ఉన్న రహదారిని కేవలం సైనికులకు మాత్రమే అనుమతిస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రం ప్రత్యేకంగా పాసులు జారీచేస్తున్నారు. ఫుల్వామా తరహా ఆత్మాహుతి దాడుల నివారణకు ఈ నిషేధం అమలుచేస్తున్నారు.