పట్నా బీహార్ రాష్ట్రం, శరన్ జిల్లాలో శుక్రవారం ఉదయం పశువులను అపహరిస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను కొట్టి చంపారు. బనియాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకున్నది.
హతులు ముగ్గురూ పొరుగు గ్రామానికి చెందినవారు. ఉదయమే బనియాపూర్ వైపు వచ్చిన ఆ ముగ్గురినీ గ్రామస్థులు పట్టుకున్నారు. అనుమానంతో వారిని చితకబాదారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే వారి ప్రాణాలు పోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు