శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. షోపియాన్ జిల్లా కెల్లర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.
సిఆర్పిఎఫ్, ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరు ఉగ్రవాదులు అక్కడే ఉండవచ్చని అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
గత శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వారం రోజుల్లో ఇది రెండవ ఎన్కౌంటర్ అని పోలీస్ అధికారులు న్యూస్ ఏజన్సీకి తెలిపారు.
#Shopian #encounter update: 03 #terrorists killed. Arms & ammunition recovered. Identities & affiliations being ascertained. @JmuKmrPolice @Sandeep_IPS_JKP pic.twitter.com/r0thdwRuAX
— Kashmir Zone Police (@KashmirPolice) March 28, 2019