ఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో మంగళవారం జరిగిన ఘర్షణలపై బిజెపి, తృణముల్ కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తృణముల్ కార్యకర్తలు తన ర్యాలీపై దాడి చేశారనీ, సిఆర్పిఎఫ్ జవానులు లేకపోతే తమకు ఖాయంగా దెబ్బలు తగిలి ఉండేవని అమిత్ షా అంటున్నారు.
ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని వారే ధ్యంసం చేసి బిజెపి కార్యకర్తలపై నెడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే సాయుధులైన బిజెపి కార్యకర్తలు కాలేజీ క్యాంపస్లోకి వెళుతున్న దృశ్యం అంటూ తృణమూల్ నేత డెరెక్ ఓ బ్రైన్ ఒక వీడియోను ట్విట్టర్లో పేస్టు చేసారు. అమిత్ షా బయట నుండి బిజెపి గుండాలను తీసుకువచ్చి విధ్వంసాలకు పాల్పడ్డారనీ, తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నారనీ ఆయన అంటున్నారు.
#Video #1 Evidence of what BJP goons did at Amit Shah’s road show in #Kolkata #Vidyasagar pic.twitter.com/TrQnF8KYdH
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) May 15, 2019