న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రేపటి నుంచి రెండు రోజులు భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్ను తాజాగా మరోసారి ప్రకటించారు.
పర్యటన షెడ్యూల్ ఇదీ..
సోమవారం ఉదయం 11.55కి ట్రంప్ సతీసమేతంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు.
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొతెరా స్టేడియం వరకు భారీ ర్యాలీ, అనంతరం మధ్యాహ్నం 12.30కి మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం. మధ్యాహ్నం 3.30కి ఆగ్రా చేరుకుంటారు. సాయంత్రం 5.10కి తాజ్మహల్ను సందర్శిస్తారు. రాత్రి 7.30కి పాలెం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మౌర్య హోటల్లో ట్రంప్ దంపతులు బస చేస్తారు.
మంగళవారం ఉదయం 9.55కి రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. 10.45కి రాజ్ఘాట్లో నివాళులర్పిస్తారు. 11.25కి హైదరాబాద్ హౌస్లో మోదీ-ట్రంప్ ఉమ్మడి మీడియా సమావేశం. తర్వాత ద్వైపాక్షిక చర్చలు, ట్రంప్- ప్రధాని మోదీ లంచ్. మధ్యాహ్నం 2.55కి అమెరికా ఎంబసీలో సిబ్బందితో ట్రంప్ భేటీ. రాత్రి 8గంటలకు రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు విందు. రాత్రి 10గంటలకు అమెరికాకు ట్రంప్ దంపతుల తిరుగు ప్రయాణం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అహమ్మదాబాద్, ఆగ్రా, ముంబాయి నగరాలు ముస్తాబు అయ్యాయి. ఈ నగరాల్లో అనేక ప్రాంతాలలో హోల్డింగ్ లు, జెండాలు, బిల్ బోర్డులు స్వాగత తోరణాలుగా వెలిసాయి.ఆగ్రా లోని పాలరాతి కట్టడం, తాజ్ కు మరింత మెరుగులు దిద్దడంతోపాటు అక్కడ భారీ భద్రతా చర్యలు చేపట్టారు.