న్యూఢిల్లీ: ‘‘జూన్ ఒకటో తేదీ నుంచి బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు. బ్యాంకులకు ఐదు రోజుల పనిదినాలను రిజర్వు బ్యాంకు ఆమోదించింది. రోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇవి ఉంటాయి. మిగిలిన రంగాలు కూడా ఇలా ఎందుకు చేయకూడదు? ప్రైవేటు రంగం? ఆసుపత్రులు? ముంబై, సూరత్ లాంటి మెట్రో నగరాల్లో నాణ్యమైన జీవితం గడిపేందుకు తగిన సంపాదన ఉంటోంది కదా’’ … ఈ సందేశం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపించింది.
ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాలలో కూడా దీన్ని విపరీతంగా షేర్ చేసుకున్నారు.
2017 ఏప్రిల్ నుంచే ఈ తప్పుడు కథనం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోందని ‘ఆల్ట్ న్యూస్’ కనుగొంది. బ్యాంకు సెలవల గురించి రిజర్వు బ్యాంకు ఇచ్చిన చిట్టచివరి నోటిఫికేషన్ 2015 ఆగస్టులో వచ్చింది. దాని ప్రకారం అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్, ప్రభుత్వరంగ, ప్రైవేటు, విదేశీ, సహకార, గ్రామీణ, స్థానిక బ్యాంకులన్నీ 2015 సెప్టెంబరు 1 నుంచి ప్రతి రెండో, నాలుగో శనివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటాయి. అయితే బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, అధికారుల సంఘాలు కూడా ప్రతి శనివారం సెలవు కావాలని డిమాండ్ చేస్తున్నాయి.
కొన్ని ప్రముఖ బ్యాంకులను కస్టమర్లు ట్విట్టర్ ద్వారా అడిగినప్పుడు కూడా అవి దీని గురించి సమాధానాలు ఇచ్చాయి.
@HDFCBank_Cares … today branches are open???
— Pratik D Khodade (@pratik_khodade) March 23, 2019
@TheOfficialSBI
Today SBI Chakala branch is opened or closed
Near JB Nagar Metro Branch— krishnan (@krishnanchamp) July 14, 2018