హరియాణాలోని రోహ్ తక్ నుంచి సెహ్వాగ్ పోటీచేస్తాడని గతంలో వదంతులు వచ్చాయి. దీనిపై వీరూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘వదంతుల లాంటి కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. 2014లోనూ ఇలాగే అన్నారు. 2019లో కూడా వదంతులలో కొత్తదనం లేదు. అప్పుడూ, ఇప్పుడూ నాకు ఆసక్తి లేదు. బాత్ ఖతమ్. 5ఇయర్స్ చాలెంజ్’’ అన్నాడు.
జూలైలో కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ కలిసి సెహ్వాగ్ వద్దకు వెళ్లారు. మద్దతు కోసం కలయిక అనే పార్టీ కార్యక్రమంలో భాగంగా వాళ్లు వెళ్లారు. దాంతో వీరూ బీజేపీలో చేరినట్లేనని వదంతులొచ్చాయి. గంభీర్ మాత్రం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లే తెలిసింది. డిఫెన్స్ కాలనీ సంఘం సమావేశానికి కూడా అతడు వెళ్లాడు. కానీ పైకి మాత్రం అబ్బే అదేం లేదనే గంభీర్ అంటున్నాడు.