Vizag Steel: ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరించనున్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఏపీలో ప్రతిపక్ష, విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటికరిస్తే చూస్తు ఊరుకోమని అన్నివర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, మరోవైపు కేంద్రం ప్రైవేటీకరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించినట్టు సమాచారం.
Read More : Vizag Steel : సినీ హీరోల్లారా…. కాస్త `విశాఖ ఉక్కు` పట్టించుకోండి
టాటాల చేతికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ…
దేశంలోనే సముద్ర తీరాన ఉన్న అతిపెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారంగా విశాఖ ఫ్యాక్టరీ ప్రత్యేకతను చాటుకుంది. వైజాగ్ ఉక్కు కార్మాగారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కూడా నిర్దారించారు. కాగా, ఈ డీల్కు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. విశాఖ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది.
అధికార, ప్రతిపక్షాలు….
విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటన చేయడంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు. దీనిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మరో ఉక్కు ఉద్యమం తప్పదు.లక్షలాది మంది ఏళ్ల తరబడి ఉద్యమించి 32 మంది ప్రాణత్యాగంతో స్టీల్ప్లాంట్ను సాధించుకున్నాం. దీన్ని ప్రైవేటీకరణకు ఒప్పుకొనేది లేదు“ అంటూ
తేల్చిచెపుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతుండటంతో వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అంతేకాకుండా, కేంద్రం తీసుకున్ని నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.