న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై పోరాడే పరిస్థితి లేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనప్రాయంగా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్ తర్వాత ఆంధ్రాభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
బిజెపికి 250 సీట్లకు మించి రాకపోయిఉంటే పరస్థితి మరోలా ఉండేదనీ, ఇప్పుడు వారికి వైసిపి ఎంపీల మద్దతు అవసరం లేదనీ ఆయన అన్నారు. ‘ఇది మన దురదృష్టం. ఏం చేస్తాం. ఢిల్లీ వచ్చి కలిసిన ప్రతిసారీ ప్రధానిని ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉంటాను. ఆయన ఇచ్చేంతవరకూ అడుగుతూనే ఉంటాను’ అని జగన్ అన్నారు.
2014లో రాష్ట్రవిభజన జరిగిన వెంటనే ప్రణాళికా సంఘం రద్దు కాలేదనీ, ఆ సంవత్సరం డిసెంబర్ వరకూ అది కొనసాగిందనీ, తర్వాతనే నీతి అయోగ్ వచ్చిందనీ జగన్ చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకహోదాకు ఆమోదం తెప్పించుకోవాల్సిందని ఆయన అన్నారు.
‘ప్రత్యేకహోదా మన హక్కు. ఇప్పుడు వదిలిపెడితే ఇక రాదు. తర్వాత అడిగేవాడు ఉండడు. సాధించేంతవరకూ అడగాలి. ఆయన ప్రధాని. ఆయన సహాయం లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యపడదు. కలిసిన ప్రతిసారీ ఆయన వెంటపడడమే’ అని జగన్ అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ప్రత్యేకహోదా విషయంలో పూర్తి మద్దతుగా నిలబడతానని హమీ ఇచ్చినట్లు జగన్ తెవిపారు.