కొన్ని ఘటనలు సినిమాల్లో కనిపిస్తే కడుపుబ్బా నవ్వుతాం.. అదే రియాలిటీలో వస్తే వామ్మో అంటాం. ఇక అలానే పోకిరి సినిమాలో పూరి జగన్నాథ్ బాబ్బా బాబ్ అంటూ బ్రహ్మానందం, అలీ వెనుక జరిగే కామెడీ రియాలిటీలో జరిగింది. కానీ ఆ ఘటన మనం ఊహించినంత కామెడీగా అయితే లేదు. ఎందుకంటే బిచ్చమేయలేదని కోపం రగిలిపోయిన హిజ్రా ఆ వ్యక్తిని దారుణంగా కొట్టింది. ఇక ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి రోజు మార్నింగ్ వాక్ కి వెళ్లి అక్కడ ఒక పేపర్ తీసుకుంటాడు. ఇక సమయంలో ఫోన్, పర్సు తీసుకెళ్లే అలవాటు లేదట. ఇక అలానే నిన్న కూడా మార్నింగ్ వాక్ కి వెళ్లిన వ్యక్తి పేపర్ కొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటో వచ్చి అతని ముందు ఆగిందట. అందులో నుంచి వచ్చిన ఓ హిజ్రా అతడిని 10 రూపాయిలు ఇవ్వాలని అడిగింది.
కానీ అతని దగ్గర పర్సు లేకపోవడంతో డబ్బులు లేవని కేవలం 5 రూపాయిలే ఉన్నాయని చెప్పినప్పటికీ ఆ హిజ్రా అతన్ని పక్కనికి కదలనివ్వలేదు. డబ్బు ఇస్తే కానీ పంపేది లేదంటూ అక్కడే చాలాసేపు విసిగించింది. చివరికి కాలుకు ఉన్న చెప్పుతో కొట్టింది. దింతో ఆమెను తోసి అతడు పారిపోతుండగా ఆటోలో నుంచి దిగిన మరో ఇద్దరు అతన్ని వెంబడించి దారుణంగా చెయ్యి విరగొట్టి అక్కడి నుంచి పరార్ అయ్యారు.
అనంతరం ఇంటికి వెళ్లిన అతను కొడుకులతో బయటకు వచ్చి అతనిపై దాడి చేసిన వారిని వెతికి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి అప్పగించగా అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా హిజ్రా ప్రతిరోజు రోడ్డుపై బిక్షాటన చేస్తుందని ఆ ఇద్దరు ఆటో డ్రైవర్లని ఆమె తెలిపింది. దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.