Kim: కిమ్ జోంగ్ ఉన్…. ఈ ఉత్తర కొరియ రథసారథి ఓ దశలో తన దూకుడు చర్యలతో ప్రపంచాన్ని వణికించారు. పొరుగున ఉన్న దేశంతో పాటు అగ్రరాజ్యం అమెరికా వరకు తన కామెంట్లతో కలకలం సృష్టించాడు కిమ్. అయితే, ఆయన ఇప్పుడు వణికిపోతున్నాడు. ఎందుకంఏట ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాన ఆహారపదార్థ ధరలు కొండెక్కాయి. ఆహార కొరతను అధినేత కిమ్ జాంగ్ ఉన్ అంగీకరించారని అక్కడి ప్రభుత్వ అధికార న్యూస్ ఏజెన్సీ అయిన కొరియన్ సెంట్రల్ ప్రకారం తెలుస్తోంది.
Read More: Corona: చైనా సంచలన వార్నింగ్… కరోనాను ప్రపంచానికి అంటించిందే కాకుండా…
పరిస్థితి ఏంటంటే…
ఉత్తర కొరియా లో ఆహార కొరతతో ధరలు విపరీతంగా పెరిగాయి. అందులో టీ, కాఫీతోపాటు అరటి పండ్లు కూడా ఉన్నాయి. దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లోని వ్యాపారులు ఒక డజన్ అరటి పండ్లను 45 డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.3,335)కు అమ్ముతున్నారని సమాచారం. బ్లాక్ టీ ఒక ప్యాకెట్ 70 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.5,190)కు, ప్యాకెట్ కాఫీ 100 డాలర్లు (భారత కరెన్సీలో రూ.7,414)కు అమ్ముతున్నారని తెలిసింది. దీన్ని బట్టి అక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read More: Corona: గుడ్ న్యూస్ః150కే హైదరాబాద్లో కరోనా టీకా
కిమ్ ఏమంటున్నారంటే…
గతేడాది సంభవించిన టైఫూన్ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కిమ్ జాంగ్ అన్నట్లు సమాచారం. టైఫూన్ వల్లే దేశ ప్రజల అవసరాలను తీర్చేంత ఆహార ధాన్యాలను వ్యవసాయ రంగం అందించలేకపోయిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఆహార కొరతను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సెంట్రల్ కమిటీని కిమ్ జాంగ్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగమించడానికి కొరియాకు 8.6 లక్షల టన్నుల ఫుడ్ అవసరమని అంచనా. అయితే కరోనా వ్యాప్తి భయం నేపథ్యంలో నార్త్ కొరియా బార్డర్ మూసేసి ఉంది. మొత్తంగా కిమ్ సైలెంట్ అయిపోయారని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?