టీ కాంగ్రెస్ పార్టీ నేత తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చూసి ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇక కనుమరుగై పోయినట్టే అని అప్పట్లో వ్యాఖ్యలు చేశారు కాని తర్వాత పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని పేర్కొన్నారు.
అదేవిధంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక తెలంగాణలో కేసీఆర్ కి తిరుగులేదని భావించారు. కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా పూర్తిగా ఫలితాలు తారుమారయ్యాయి అని రేవంత్ రెడ్డి తెలిపారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి చూసి నాయకులు, కార్యకర్తలు గానీ ఎవ్వరు అధైర్య పడవదు అని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో ఏ ఎన్నికలు జరిగినా జగన్ గెలిచేవారు కానీ తర్వాత పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని రేవంత్ తెలిపారు. ఇదే క్రమంలో తర్వాత పరిస్థితి చూస్తే జగన్ ఉపాధి కూలీ పనులు చేసుకునే బాపట్లకు చెందిన సురేష్ ని ఎంపీగా గెలిపించుకున్నారు అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న గడ్డుకాలం రాబోయే రోజుల్లో ఉండదని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.