(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలో ఆనకట్టకు గండి కొట్టింది పీతలేనన్న మంత్రి గుర్తున్నాడా? ఈరోజు కొందరు కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి కాసిని పీతలు అక్కడ విసిరారు.
భారీగా కురిసిన వానల కారణంగా రత్నగిరి జిల్లాలోని తవారే డ్యాంకు జూలై రెండవ తేదీ రాత్రి గండి పడింది. ఫలితంగా 19 మంది మృతి చెందారు. 19 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డ్యాంలో లీకేజీలు కనబడ్డాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్కడ పెద్ద ఎత్తున చేరిన పీతల వల్లనే లీకేజీలు ఏర్పాడ్డాయని పహారాష్ట్ర జల సంరక్షణ మంత్రి తానాజీ సావంత్ మరుసటి రోజు ముంబైలో మీడియాతో అన్నారు. గత వారంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవద్ నాయకత్వంలో కొందరు కార్యకర్తలు నౌపాడ పోలీసు స్టేషన్కు పీతలు తీసుకువెళ్లి వాటిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
#WATCH: NCP workers stage protest and threw crabs outside the residence of Maharashtra Water Conservation Minister Tanaji Sawant in Pune against his statement on Ratnagiri's Tiware dam breach. The Minister had said that crabs were responsible for the breach in the dam. pic.twitter.com/7wbsT8yGIs
— ANI (@ANI) July 9, 2019
ఈ రోజు మంత్రి ఇంటి దగ్గర పీతలు వదిలిపెట్టిన కార్యక్రమాన్ని వీడియో తీశారు. ‘23 మంది కొట్టుకుపోయారు. ఇంకా కొందరి ఆచూకీ తెలియదు. మంత్రి గారు దీనికి పీతలు కారణమంటారు. నాసిరకం నిర్మాణం చేసిన కాంట్రాక్టరును రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బిజెపి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నది’ అని జితేంద్ర అవద్ మీడియాతో అన్నారు.