షోలాపూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లో శరద్ పవార్, పృథ్వీరాజ్ చవాన్ తప్ప ఎవరూ మిగలరని అన్నారు. ఆదివారం షోలాపూర్ లో జరిగిన మహాజనదేశ్ యాత్రలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఇంకా పూర్తిగా తలుపులు తెరవలేదని, ఒకవేళ పూర్తిగా తెరిస్తే ఎన్సీపీలో శరద్ పవార్, కాంగ్రెస్ లో పృథ్వీరాజ్ చవాన్ తప్ప ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలో వలసలు పెరుగుతున్నాయన్నారు.
LIVE: HM Shri @AmitShah addressing Maha-Janadesh Yatra in Solapur, Maharashtra. #ShahAtMahaJanadesh https://t.co/88d4n9TYsv
— BJP (@BJP4India) September 1, 2019