(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందా? కశ్మీర్ అంశంపై రగిలిపోతున్న దాయాది దేశం ఇప్పుడు భారత్ తో యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పై పాకిస్థాన్ మరోసారి విషం కక్కింది. భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తే అణ్వాయుధాలతోనే ముగుస్తుందని, దీని ప్రభావం మిగతా దేశాలపైనా పడుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. అంతేకాదు పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలే లేవన్నారు. జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దుచేసిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఇమ్రాన్ తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమే అంటూ విద్వేషపూరితంగా మాట్లాడారు.
(5/6) Prime Minister of Pakistan Imran Khan Speech at 74th United Nations General Assembly Session, New York, USA (27.09.19)#ImranKhanVoiceOfKashmir@ImranKhanPTI pic.twitter.com/KVrKwbyieQ
— PTI (@PTIofficial) September 27, 2019
ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్కు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇమ్రాన్ ఖాన్ది మధ్యయుగం నాటి ఆలోచన ధోరణిగా కనిపిస్తోందని భారత ప్రతినిధి విధిషా మైత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అణుయుద్ధం అంటూ పదే పదే ప్రస్తావించడం ద్వారా ఇమ్రాన్ అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలు భయపడ్డాయన్నారు. ఒకప్పుడు జెంటిల్మెన్ గేమ్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు నరనరాల విద్వేషాన్ని మూటగట్టుకున్నారని దుయ్యబట్టారు. కశ్మీర్ ముస్లింలపై ఆందోళన చెందుతున్న ఇమ్రాన్ చైనాలోని మైనారిటీలపై కూడా గళం విప్పాలని నిలదీశారు. యూఎన్ బ్యాన్ చేసిన 130 మంది ఉగ్రవాదులు పాక్లోనే ఉన్నారని, 25 ఉగ్ర సంస్థలు కూడా అక్కడే ఉన్నాయని, దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా అని విదిశా ప్రశ్నించారు.
#WATCH Vidisha Maitra, First Secretary MEA exercises India's right of reply to Pakistan PM Imran Khan's speech says, "Can Pakistan PM confirm the fact it is home to 130 UN designated terrorists and 25 terrorist entities listed by the UN, as of today?" pic.twitter.com/vGFQH1MIql
— ANI (@ANI) September 28, 2019
మరోవైపు ప్రపంచానికి తమ దేశం యుద్ధాన్ని కాకుండా, జ్ఞానాన్ని పంచిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ప్రపంచానికి భారత్ యుద్ధాన్ని ఇవ్వలేదు. బుద్ధుడిని ఇచ్చింది. బుద్ధుని శాంతి సందేశాన్నిచ్చింది. అందుకే ఉగ్రభూతానికి వ్యతిరేకంగా భారత్ బలంగా గళమెత్తుతున్నది. ఐరాస శాంతి మిషన్లలో ప్రాణాత్యాగం చేసిన జవాన్లలో అత్యధికులు భారత్కు చెందినవారే’ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో కాకుండా ప్రపంచం మొత్తానికి పెనుముప్పలా పరిణమించిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకమవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Addressing the @UN General Assembly. Watch. https://t.co/N7J54af30s
— Narendra Modi (@narendramodi) September 27, 2019
మొత్తం మీద ఐక్యరాజ్య సమితి వేదికపై భారత్ శాంతి మంత్రం గురించి మాడ్లాడితే.. పాక్ మాత్రం ఉగ్రవాదం, రక్తపాతం గురించి ప్రస్తావించింది. కశ్మీర్ అంశంపై నిందలు వేస్తూ అక్కడ హింస తప్పదంటూ రెచ్చగొట్టేలా ఇమ్రాన్ మాట్లాడటం చూస్తే.. పాక్ మరో పెద్ద పన్నాగం పన్నుతోందని అర్ధమవుతోంది.