NewsOrbit
రాజ‌కీయాలు

ఏకపక్షంగా రాజధానిని ఎలా మారుస్తారు?

విజయవాడ: స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఏపీ రాజధానిని తరలించేందుకు సిద్ధమవుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. బుధవారం అమరావతి రైతులకు మద్దతుగా జనసేన నేత పోతిన మహేష్‌ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దీనికి సంఘీభావం తెలిపిన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల.. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అధికారమదంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధానిని మార్చేస్తారా ? అని ప్రశ్నించారు. రాజధాని రైతులతో చర్చించకుండా ఏకపక్షంగా రాజధానిని ఎలా మారుస్తారని నిలదీశారు.  అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్… అధికారంలోకి రాగానే మాట తప్పారని విమర్శించారు. ఒక ప్రాంత ప్రజల పొట్టకొట్టి… మరో ప్రాంత ప్రజల కడుపు నింపుతారా? అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ ది విభజించు, పాలించు అనే దురాలోచన అని విమర్శించారు. ఏడు నెలల పాలనలో రంగులు వేసుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

జనసేన నేత జనసేన నేత పోతిన మహేష్‌ మాట్లాడుతూ భూములిచ్చిన రైతుల్ని క్రిమినల్స్‌లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ వెనుక జగన్, విజయసాయి స్వార్ధం ఉందని ఆరోపించారు. నివేదికలు రాకముందే ప్రకటనలు చేయడం జగన్‌ మాయ అని విమర్శించారు. అమరావతి ముంపులో ఉందంటున్న ప్రభుత్వం… హుద్‌హుద్‌ తుఫాన్ తో నష్టపోయిన విశాఖ గురించి ఎందుకు చెప్పడం లేదని ? ప్రశ్నించారు.

Related posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Leave a Comment