Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ దక్షిణాది చలనచిత్ర రంగంలో ఆమె అనేక సినిమాలు చేయడం జరిగింది. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటించింది. కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కావటంతో అతి చిన్న వయసులోనే స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక హీరోయిన్ గా 2013వ సంవత్సరంలో “గీతాంజలి” సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2015వ సంవత్సరంలో “నేను శైలజ” సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ అనేక విజయాలు అందుకోవటం జరిగింది. గత ఏడాది “దసరా” సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో లేటెస్ట్ గా “బేబీ జాన్” అనే సినిమాతో హిందీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. తమిళ దర్శకుడు కాలిస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి “జవాన్” దర్శకుడు అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకోవడం జరిగింది. ఇదే సమయంలో మే 31వ తారీకు 2024వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. కీర్తి సురేష్ తో పాటు వామిక గబ్బి కథానాయకులుగా నటిస్తున్నారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో చిన్న చిన్న హీరోల పక్కన హీరోయిన్ ఛాన్సులు అందుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయింది. అయితే బాలీవుడ్ ఎంట్రీ విషయంలో ఏకంగా మొదటి సినిమాలోనే స్టార్ హీరో వరుణ్ ధావన్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకోవటం విశేషం. దీంతో బాలీవుడ్ లో కూడా కీర్తి సురేష్ సత్తా చాటాలని ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.