Pushpa 2: భారతీయ చలనచిత్ర రంగం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా “పుష్ప 2”. ఈ సినిమా విడుదలకు సంబంధించి మొన్నటి వరకు రకరకాల వార్తలు రావడం జరిగాయి. ఆల్రెడీ ఆగస్టు 15వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించారు. అయితే మధ్యలో జగదీష్ అరెస్టు కావడంతో చెప్పిన తేదీకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని మధ్యలో ప్రచారం గట్టిగా జరిగింది. కానీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన తేదీకే ఆగస్టు 15వ తారీఖు నాడే “పుష్ప 2” రిలీజ్ కాబోతుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమా విడుదల తేదీ పై దర్శకుడు సుకుమార్ ఫోటోని పోస్ట్ చేసి మరి షేర్ చేయడం జరిగింది.
విషయంలోకి వెళ్తే మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ చేస్తున్న ట్విట్టర్ అకౌంట్లో ఆగస్టు 15వ తారీకు “పుష్ప 2” విడుదల కాబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో షూటింగ్ సెట్ లో దర్శకుడు సుకుమార్ ని రష్మిక తీసిన ఫోటోని మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ చేసే ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆరు నూరైనా మరోసారి చెప్పిన సమయానికి సినిమా వస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే “పుష్ప” మొదటి భాగానికి ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. పాన్ ఇండియా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ₹100 కోట్లు రాబట్టింది.
అయితే ఈసారి ప్రమోషన్స్ విషయంలో సినిమా విడుదల సమయానికి ఒక నెల రోజులు ముందు నుంచే గట్టిగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న అద్భుతమైన నటన కనపరచడం జరిగింది. డాన్స్ పరంగా కూడా ఆమె వేసిన కొన్ని స్టెప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. “పుష్ప” సినిమా ఒక్కసారిగా రష్మిక ఇమేజ్.. జాతీయస్థాయిలో పెంచేయడం జరిగింది. “పుష్ప” సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది.