అమరావతి: ఈ నెల 17వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి సమావేశంలో సభ్యులు నిర్ణయించారు.
కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బిఏసి సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం ఏడు పని దినాలు సభ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. ఈ నెల 17 తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 14వ తేదీ శనివారం,15వ తేదీ ఆదివారం రెండు రోజులూ అసెంబ్లీకి సెలవు.
స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, శాసనసభ ఉపప్రతిపక్షనేత కింజరపు అచ్చంనాయుడు హాజరయ్యారు.