(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని మార్చాలని చూస్తే కేంద్రం, బిజెపి చూస్తూ ఊరుకోదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అన్నారు. కేంద్రంతో మాట్లాడే ఈ ప్రకటన చేస్తున్నానని ఆయన చెప్పారు. రాజధాని రైతులు సుజనాను కలిసి అమరావతిలోనే రాజధాని కొనసాగేలా చూడాలంటూ వినతి పత్రం అందజేశారు. రైతులు చేస్తున్న ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు.
రాజధాని సమస్య పూర్తిగా ఆగిపోయే వరకూ ప్రజలు ఆందోళనలు కొనసాగించాలని సుజనా సూచించారు.