Balakrishna: సినిమా రంగమైన రాజకీయ రంగమైన తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. గత ఏడాది వరుసగా రెండు సినిమాలతో భారీ హిట్స్ అందుకోవటం జరిగింది. సంక్రాంతికి “వీరసింహారెడ్డి” దసరా పండుగకు “భగవంత్ కేసరి” సినిమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరిగింది. అయితే ఏపీలో ఎన్నికలు వస్తున్నా నేపథ్యంలో.. బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అంట. విషయంలోకి వెళ్తే ఎన్నికల నోటిఫికేషన్ కి దగ్గర పడటంతో సినిమా షూటింగ్స్ కి లాంగ్ గ్యాప్ ఇచ్చినట్లు టాక్.
2014, 2019 ఎన్నికలలో హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాలకృష్ణ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికలలో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొద్ది రోజుల క్రితం హిందూపురం నియోజకవర్గంలో ర్యాలీ చేయడం జరిగింది. హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దీంతో ఈ ఎన్నికలలో కూడా గెలవాలని బాలకృష్ణ డిసైడ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ స్టార్ క్యాంపెనర్ కావడంతో.. రాయలసీమతో పాటు మిగతా చోట్ల భారీ ఎత్తున ప్రచారం చేయడానికి సిద్ధపడుతున్నారు. గతంలో కూడా ఏరకంగానే తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం జరిగింది. దీంతో ఒకపక్క పవన్ కళ్యాణ్ మరోపక్క బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు ఉండటంతో… చంద్రబాబు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. 2024 ఎన్నికలను తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ ఓడించాలని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. దీంతో ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికే షూటింగులకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి షూటింగ్ లేకుండా.. రాజకీయంగా బిజీ కాబోతున్నారు