NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రెబల్ ఎంపిపై జగన్ మొదటి ఆస్త్రం..! ఇక నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబు..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై పాత కేసులు ఎన్నో ఉంటే ఉండవచ్చు గాక..!ఎప్పటి నుండో ఆయన బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకుండా ఎగవేస్తే ఎగవేసి ఉండవచ్చు గాక..! తన ‘పవర్ ప్రాజెక్టు’ల లావాదేవీల్లో నష్టాలు వచ్చి ప్రస్తుతం సైలెంట్ గా ఉంటే ఉండవచ్చు గాక..!కానీ ‘రఘు’పై ఉన్నట్టుండి ఇప్పుడే సీబీఐ దాడులు జరగడానికి కారణం ఏమిటి..? దీనికి “ముందు..వెనుక” కొన్ని లాజిక్కులు..లాబీయింగ్ లు చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది..!!

ap cm jagan meets pm modi in delhi
ap cm jagan pm modi

ఏమో మోడీతో జగన్ మాట్లాడి ఉండవచ్చు..!

జగన్ మహా కోపిష్టి..! జగన్ పగ పాములాంటి పగ..!! అందుకే.. “కాంగ్రెస్, చంద్రబాబు” కలిపి తనను సీబీఐ కేసుల్లో ఇరికించి జైలులో పెట్టారు అని భావించి ఇప్పటికీ చంద్రబాబుపై సీబీఐ కేసులు వచ్చే వరకూ నిద్రపోవడం లేదు..!! న్యాయ వ్యవస్థతో పోరాడుతూనే.. పార్లమెంట్ ముందు ధర్నాలు చేస్తున్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని.. ఫైబర్ గ్రిడ్ లో కుంభకోణం.. అని బయటకు లాగుతున్నారు. అటువంటి చంద్రబాబునే ఒక చూపు చూస్తున్న జగన్ కి ఎంపి రఘురామ కృష్ణం రాజు ఒక లెక్కా.? ఢిల్లీలో రోజు ప్రెస్ మీట్ లు పెట్టి ‘ఎడా పెడా, చెడామడా’ జగన్ ను వాయించేస్తున్న రఘురామ కృష్ణం రాజు అంటే జగన్ ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ‘రఘు’ను వదిలివేయాలి? అందుకే రెండు రోజుల క్రితం మోడీని కలిశారు. కలిసిన సందర్భంగా మా ఎంపి మీ పార్టీ మద్దతు చూసుకుని ఢిల్లీలో మమ్మల్ని తిడుతున్నాడు అని ఏపిలో జనం అందరూ అనుకుంటున్నారు. అతని సంగతి ఒక సారి చూడండి. అని జగన్ మోడీని అడిగి ఉండవచ్చు!. మోడీ కూడా “అయ్యో..! భలే పని.మీరు రాజ్యసభలో మిత్రులు. మిమ్మల్ని అంటే మేము ఊరుకుంటామా..ఇప్పుడే అతని పని చెప్తాం” అని తన వ్యవస్థను వాడి ఉండవచ్చు..!!ఏమో ‘రఘు’ ఖర్మ కాలి మోడీకి జగన్ కు మధ్య అతను కూడా ఒక వాక్యంగా మారి ఉండవచ్చు..!

తోక ముడిచినట్లేనా..? నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబేనా..!?

అసలు ఎంపి రఘురామ కృష్ణంరాజు అంటే జగన్ కు పగ కాదు..! మిత్రువు కాదు..! కాకపోతే ఎంపీనే!!జగన్ ను దువ్వి దువ్వీ దువ్వీ రక్తం వచ్చే వరకూ గోకారు. ఇప్పుడు జగన్ చేత గోకించుకుంటున్నారు. అదలా ఉంటే.. జగన్ మెయిన్ టార్గెట్ చంద్రబాబు. ” ఒక సారి సీబీఐని నా అవసరం కోసం కాస్త మళ్ళించండి ప్రభూ..”అని జగన్ మోడీని వేడుకుంటే అందులో మొదటి టార్గెట్ రఘురామ కృష్ణం రాజు అయితే ప్రధాన టార్గెట్ మాత్రం చంద్రబాబు, లోకేష్ లే..! అయి ఉంటారు. అంటే రఘురామ కృష్ణంరాజుది కేవలం టీజర్ మాత్రమే. తరువాత ట్రైలర్, అసలు సినిమా చంద్రబాబు రూపంలో రాబోతున్నాయేమో..! మోడీ – జగన్ కలయిక రోజే “న్యూస్ ఆర్బిట్” పరోక్షంగా ప్రస్తావించింది. “ఏపిలో ఎవరికో మూడింది” అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. దానికి పర్యవసానాలు జగన్ – మోడీ కలయికలో లాజిక్కులు, పాయింట్ లు ఆలోచిస్తూ ఇవన్నీ ఒక్కోదానికి బయటపడతాయుంటాయి. ఇంకా మరెన్ని చూస్తామో..!!

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju