అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ ప్రకటన ఇటు అమరావతి ప్రాంత రైతు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన, అలజడి రేకెత్తించగా అటు విశాఖ ప్రజానీకంలో సంతోషాన్ని నింపుతోంది. మూడు రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. మరొ పక్క విశాఖలో సిఎం నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మహార్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు అనుకూలంగా ఉంటుందన్న ప్రకటన ఆ ప్రాంత వాసులకు సంతోషాన్ని కల్గిస్తోంది. విశాఖలో జరిగిన ఈ ర్యాలీలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పాల్గొన్నారు.