న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ అజిత్ పవార్ ఒంటరి వాడయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్సిపి అధినేత శరద్ పవార్ను విబేధించి సొంత నిర్ణయం తీసుకుని బిజెపితో చేతులు కలపడంతో ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్పై పార్టీ అధిష్టానం వేటు వేసిన విషయం విదితమే. ఈ పరిణాల నేపథ్యంలో శరద్ పవార్ రాజకీయ వారసురాలు ఆయన కుమార్తె సుప్రియా సూలేనని దిగ్విజయ్ ట్వీట్ చేశారు.
‘ఎన్సిపి నుండి గెలిచిన 54 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు. అజిత్ పవార్ ఒంటరి అయ్యాడు. ఇప్పుడు శరద్ పవార్ వారసురాలివి నువ్వే’ అని సుప్రియా సూలేని దిగ్విజయ్ అభినందించారు.
NCP के ५४ में से ५३ शरद पवार जी के साथ रहेंगे। अजीत पवार अकेले रह जायेंगे। शरद पवार के उत्तराधिकारी की समस्या भी हल हो गयी। बधाई सुप्रिया!!
— digvijaya singh (@digvijaya_28) November 24, 2019