అమరావతి: రాష్ట్రంలో అవినీతిపై భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు కొత్తగా మరో కాల్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోంది. ఈ కాల్ సెంటర్ను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించనున్నారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించాలన్నది తన ధ్యేయమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అవినీతి అనేది ఏ స్థాయిలోనూ ఉండటానికి వీలులేదనీ, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు.
అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి చెందిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ 1064, ఆర్టిజిఎస్ 1100 కాల్ సెంటర్కు వివిధ శాఖల్లోని ఉద్యోగుల అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతిపై ఫిర్యాదులకు కొత్తగా 10044 టోల్ఫ్రీ నంబర్ను కేటాయించారు. మరో పక్క ఎసిబి 1064 అనే టోల్ ఫ్రీ నంబర్తో పాటు 8333995858 అనే వాట్స్ఆప్ ద్వారా కూడా ఫిర్యాదులు సీకరిస్తున్నది. ఈ కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులను ఇంటిలిజెన్స్ ఐఎస్, ఎసిబి అధికారి పర్యవేక్షిస్తారు.