ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజానీకం సాధారణ సమయాల్లో కంటే పీక్ అవర్స్లో తమ విలువైన సమయాన్ని రోడ్డు పాల్జేసుకుంటున్నారు. వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్ జామ్ బారిన పడుతున్న నగరాల్లో ముంబై మొదటిస్థానంలో ఉంది. సామ్యానులతో పాటు సెలబ్రెటీలకు కూడా ట్రాఫిక్ జామ్ సెగ తగిలింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి కూడా ట్రాఫిక్ తో అవస్థలు పడ్డారు. దీంతో అక్షయ్ ముంబై మెట్రో రైలులో ప్రయాణించాడు. సినిమా షూటింగ్ తర్వాత తక్కువ సమయంలో ఇంటికి చేరుకునేందుకు అక్షయ్ మెట్రోరైలు ఎక్కాడు.
‘‘ముంబై-వెర్సోవాకు 13 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు నా ప్రయాణానికి 2 గంటల 5 నిమిషాలు పట్టనున్నట్లు మ్యాప్లో చూపించింది. అయితే రెండు గంటలు పట్టే ప్రయాణానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోనున్నాను. ఇవాళ మెట్రో రైలులో నా రైడ్. ట్రాఫిక్ అత్యంత ఎక్కువగా ఉండే సమయంలో ఘాట్కోపర్ నుంచి వెర్సోవా వరకు ఓ బాస్లాగా ప్రయాణం చేశా’ అని అక్షయ్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
My ride for today, the @MumMetro…travelled #LikeABoss from Ghatkopar to Versova beating the peak hours traffic ? pic.twitter.com/tOOcGdOXXl
— Akshay Kumar (@akshaykumar) September 18, 2019
ఇటీవల హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో నితిన్ కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. దీంతో ఆయన కారు దిగి మెట్రో రైలెక్కి గమ్య స్థానానికి చేరుకున్నారు. కిక్కిరిసిన కోచ్లో ఎక్కిన నితిన్తో సెల్ఫీలు దిగేందుకు, షేక్హ్యాండ్ ఇచ్చేందుకు మెట్రో ప్రయాణికులు పోటీ పడ్డారు. నితిన్ సైతం వారితో నవ్వుతూ మాట్లాడుతూ సందడి చేశారు. మెట్రో స్టేషన్లో తీసుకున్న ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేసిన నితిన్.. రోడ్లు చాలా రద్దీగా ఉన్నాయని, ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు మెట్రో ఎక్కానని. ఈ ప్రయాణం అద్భుతంగా సాగింటూ’ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.