అమరావతి: పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని మోదీ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని వ్యవస్థలనూ మోది నాశనం చేశారనీ, తాజాగా ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేసేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగామోది వ్యవహరిస్తున్నారని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.
మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని వ్యవస్థలనూ మోది నాశనం చేశారనీ, తాజాగా ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేసేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగామోది వ్యవహరిస్తున్నారని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.