ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్ర సెంటిమెంట్ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకపక్క ప్రధాన ప్రత్యర్ధి వైఎస్ జగన్మోహన రెడ్డిని విమర్శిస్తూనే టిఆర్ఎస్ నేత కెసిఆర్పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో తాను హైదరాబాద్ ప్రచారానికి వెళ్లగానే కెసిఆర్ ప్రయెగించిన సెంటిమెంట్ అస్త్రాన్ని చంద్రబాబు కూడా బయటకు తీశారు.
జగన్ క్విడ్ ప్రొ కోకు ఆధారాలు ఉన్నాయంటూ ఇడి నుంచి 2017లో సిబిఐకి వెళ్లిన లేఖపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని కెసిఆర్పై విమర్శలు చేశారు. ఇక్కడికొచ్చి రాజకీయం చేయడానికి కెసిఆర్ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రులకు పౌరుషం ఉండాలన్నారు. అక్కడున్న విలేఖరులను ఉద్దేశించి మీకూ పౌరుషం ఉండాలని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మాటల్లోనే…కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారు. ప్రత్యేకహోదాకు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఆయన అనని మాట లేదు. చేయని అవమానం లేదు. పోలవరానికి అడ్డుపడుతారు. నదుల అనుసంధానాన్ని విమర్శిస్తున్నారు. అలాంటి వాడికి జగన్ ఊడిగం చేస్తున్నారు.
కెసిఆర్ నాది ధనిక రాష్ట్రం అంటారు. ఎక్కడ నుంచి వచ్చింది సంపద. మనం అందరం కష్టపడితే వచ్చింది. నేను చేసిన అభివృద్ధిని మర్చిపోయారు. మరోపక్క ఆంధ్రావాళ్ల పెత్తనం అంటారు. ఉలవచారును వెక్కిరిస్తారు. 60 ఏళ్ల కష్టాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చాం. మళ్లీ మొదటినుంచి నిర్మించుకుంటున్నాం. పేద రాష్ట్రం కదా అని 500 కోట్లు ఇద్దామనుకున్నారట. ప్రధాని మోదీ మట్టినీళ్లు ఇచ్చి వెళ్లడంతో నేనూ గమ్మున ఉండాల్సి వచ్చింది అంటారు, అని కెసిఆర్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన చట్టం ప్రకారం అన్ని లెఖ్కలూ చూస్తే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణా లక్ష కోట్లు ఇవ్వాల్సివస్తుందనీ, ఆ సంగతి ఎత్తకుండా ఈ మాటలు అవమానించడానికి కాకపోతే ఏమిటనీ చంద్రబాబు ప్రశ్నించారు.
ఇప్పుడు ఎన్నికల ఖర్చు కోసం జగన్కు కెసిఆర్ వెయ్యి కోట్లు ఇస్తున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్తో ఆయన కుమ్మక్కు అయ్యారనీ, కాంట్రాక్టులు ఇస్తున్నారనీ ఆయన అన్నారు. జగన్ నేరస్థుడు కాబట్టి మోదీకీ, కెసిఆర్కి భయపడి పౌరుషహీనంగా ఆంధ్ర ప్రయోజనాలను వారికి తాకట్టు పెట్టారని ఆయన అన్నారు.
టిడిపిని గెలిపించడం చారిత్రక అవసరమని ఆయన అన్నారు. వైసిపి గెలిస్తే బయటివారు గద్దల్లా వాలిపోతారని హెచ్చరించారు.
ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్ర సెంటిమెంట్ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకపక్క ప్రధాన ప్రత్యర్ధి వైఎస్ జగన్మోహన రెడ్డిని విమర్శిస్తూనే టిఆర్ఎస్ నేత కెసిఆర్పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో తాను హైదరాబాద్ ప్రచారానికి వెళ్లగానే కెసిఆర్ ప్రయెగించిన సెంటిమెంట్ అస్త్రాన్ని చంద్రబాబు కూడా బయటకు తీశారు.
జగన్ క్విడ్ ప్రొ కోకు ఆధారాలు ఉన్నాయంటూ ఇడి నుంచి 2017లో సిబిఐకి వెళ్లిన లేఖపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని కెసిఆర్పై విమర్శలు చేశారు. ఇక్కడికొచ్చి రాజకీయం చేయడానికి కెసిఆర్ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రులకు పౌరుషం ఉండాలన్నారు. అక్కడున్న విలేఖరులను ఉద్దేశించి మీకూ పౌరుషం ఉండాలని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మాటల్లోనే…కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారు. ప్రత్యేకహోదాకు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఆయన అనని మాట లేదు. చేయని అవమానం లేదు. పోలవరానికి అడ్డుపడుతారు. నదుల అనుసంధానాన్ని విమర్శిస్తున్నారు. అలాంటి వాడికి జగన్ ఊడిగం చేస్తున్నారు.
కెసిఆర్ నాది ధనిక రాష్ట్రం అంటారు. ఎక్కడ నుంచి వచ్చింది సంపద. మనం అందరం కష్టపడితే వచ్చింది. నేను చేసిన అభివృద్ధిని మర్చిపోయారు. మరోపక్క ఆంధ్రావాళ్ల పెత్తనం అంటారు. ఉలవచారును వెక్కిరిస్తారు. 60 ఏళ్ల కష్టాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చాం. మళ్లీ మొదటినుంచి నిర్మించుకుంటున్నాం. పేద రాష్ట్రం కదా అని 500 కోట్లు ఇద్దామనుకున్నారట. ప్రధాని మోదీ మట్టినీళ్లు ఇచ్చి వెళ్లడంతో నేనూ గమ్మున ఉండాల్సి వచ్చింది అంటారు, అని కెసిఆర్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన చట్టం ప్రకారం అన్ని లెఖ్కలూ చూస్తే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణా లక్ష కోట్లు ఇవ్వాల్సివస్తుందనీ, ఆ సంగతి ఎత్తకుండా ఈ మాటలు అవమానించడానికి కాకపోతే ఏమిటనీ చంద్రబాబు ప్రశ్నించారు.
ఇప్పుడు ఎన్నికల ఖర్చు కోసం జగన్కు కెసిఆర్ వెయ్యి కోట్లు ఇస్తున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్తో ఆయన కుమ్మక్కు అయ్యారనీ, కాంట్రాక్టులు ఇస్తున్నారనీ ఆయన అన్నారు. జగన్ నేరస్థుడు కాబట్టి మోదీకీ, కెసిఆర్కి భయపడి పౌరుషహీనంగా ఆంధ్ర ప్రయోజనాలను వారికి తాకట్టు పెట్టారని ఆయన అన్నారు.
టిడిపిని గెలిపించడం చారిత్రక అవసరమని ఆయన అన్నారు. వైసిపి గెలిస్తే బయటివారు గద్దల్లా వాలిపోతారని హెచ్చరించారు.