న్యూఢిల్లీ :పోలవరం నిర్మాణం లో వాస్తవపరిస్థితి ఫై నివేదిక పంపాలని పోలవరం అధారిటీ ని కోరామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షాకవత్ తెలిపారు. ఢిల్లీ లో అయన మీడియా తో మాట్లాడారు.
పోలవరం పనులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవించాల్సిందే నని అన్నారు. హైకోర్టు పరిధి లో ఉన్నందున దానిపై ఏమి మాట్లాడనని చెప్పారు. రెండు రోజులలో పోలవరం అధారిటీ నుండి నివేదిక వస్తుందనీ ఆ తరువాత ఏమి చేయాలో నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు.
ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని అక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకునే హక్కు కేంద్రానికి ఉందని అయన అన్నారు. సమాఖ్య వ్యవస్థ లో ఎవరికీ ఎవరి ఆశీస్సులు ఉండవని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి అయన వ్యాఖ్యానించారు. కేంద్రం పని కేంద్రం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పని రాష్ట్రం చేయాలనీ అయన పేర్కొన్నారు.