అమరావతి: హైకోర్టు అంశం పై అటు రాయలసీమ, ఇటు ఆంధ్రా ప్రాంతంలో న్యాయవాదులు ఆందోళన చేస్తున్న తరుణంలో జగన్ సర్కార్ జూనియర్ న్యాయవాదులకు ఆర్ధిక సాయం ప్రకటించడం వారి నిరసనలను నీరు గార్చేందుకే అన్న వాదన వినపడుతున్నది. బార్ అసోసియేషన్ లో పేరు నమోదు చేసుకున్న జూనియర్ న్యాయవాదులందరికీ మూడేళ్ళ పాటు నెలకు అయిదు వేల రూపాయలు చొప్పున చెల్లించాలని జగన్ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని బుధవారం క్యాబినెట్ సమావేశం ఆమోదించింది. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలనీ రాయలసీమ న్యాయవాదులు, రాజధాని అమరావతి లోనే హైకోర్టు కొనసాగించాలని కోస్తాలోని తొమ్మిది జిల్లాల న్యాయవాదులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ జూనియర్ న్యాయవాదులకు ఈ వరాన్ని ప్రకటించడంతో వారు ప్రభుత్యానికి అనుకూలంగా మరవచ్చునని భావిస్తున్నారు. దీనితో హైకోర్టుపై ఆందోళన ఉధృతి తగ్గుతుందని అనుకుంటున్నారు. జగన్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో హైకోర్టు నిరసనలు తగ్గిపోవచ్చని భావిస్తున్నారు.
previous post
next post