న్యూఢిల్లీ: భారతదేశంలో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ దివస్ను పురస్కరించుకుని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయని ఏ భాషకు ఉన్న ప్రాధాన్యత ఆ భాషకు ఉందన్నారు. అయితే, భారత్కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఒక భాష ఉండాలని.. అది అత్యధికంగా మాట్లాడే హిందీ భాష ఉండాలని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో దోహదపడుతుందన్నారు. దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని.. యావత్ భారతదేశానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు అమిత్ షా ట్వీట్ చేశారు.
आज हिंदी दिवस के अवसर पर मैं देश के सभी नागरिकों से अपील करता हूँ कि हम अपनी-अपनी मातृभाषा के प्रयोग को बढाएं और साथ में हिंदी भाषा का भी प्रयोग कर देश की एक भाषा के पूज्य बापू और लौह पुरूष सरदार पटेल के स्वप्प्न को साकार करने में योगदान दें।
हिंदी दिवस की हार्दिक शुभकामनाएं
— Amit Shah (@AmitShah) September 14, 2019
‘భిన్నభాషలు, యాసలు ఉండటం మనదేశపు బలం. కానీ మనదేశంలో ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే విదేశీ భాషలకు చోటుండదు. అందుకే స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా మన పూర్వీకులు జాతీయ భాషగా హిందీ ఉండాలని కోరుకున్నారు’ అని ట్వీట్ చేశారు. ప్రపంచానికి భారత్ తరఫున హిందీ ప్రాతినిధ్యం వహిస్తుందని అమిత్ షా అన్నారు. హిందీ వల్లే దేశం ఐక్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారతీయులంతా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలను నిజం చేసేందుకు హిందీ భాష వాడకాన్ని పెంపొందించాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నాయని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలతో భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. అమిత్ షా తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఇక హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. హిందీ భాష ప్రతీ భారతీయుడి మాతృభాష కాదని ఒవైసీ అన్నారు. ‘మీరు కనీసం మన దేశపు బహుళత్వపు అందాన్ని, పలు మాతృభాషలు ఉండటాన్ని హర్షించరా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ప్రతీభారతీయుడికి భాషా, సాంస్కృతిక హక్కును కల్పిస్తోంది’ అని ఒవైసీ ట్వీట్ చేశారు.
Hi @CNNnews18, why did you delete this video where one Mr. @AmitShah is asking us to learn our “mother tongue” Hindi? Why such proactive hard work?
Humbly, I’d like to point out that you’re an English language media channel!
— Asaduddin Owaisi (@asadowaisi) September 14, 2019