(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కోల్కతా: పౌరసత్వం సవరణ చట్టానికి నిరసనలతో హోరెత్తుతున్న పశ్చిమ బెంగాల్లో ఒక యువతి వినూత్నంగా తన నిరసన నమోదు చేసింది. జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్ధి అయిన దేబస్మిత చౌదరి, యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న వెంటనే అక్కడే నుంచుని, వైస్ ఛాన్సలర్, ప్రో విసి, రిజిస్ట్రార్ సమక్షంలో సిఎఎ చట్టం ప్రతిని చించి ముక్కలు చేసింది.
It is these women who are revolutionizing India
After receiving the gold medal at the #JadavpurUniversity Convocation. #DebsSmitaChaudhary tore the Citizenship Law Amendment (CAA) on stage. #NRC_CAA_Protest @ComradeMallu pic.twitter.com/ea8pOs1Ng5— Rinse Kurian (@rinse_kurian) December 24, 2019
నేను నా యూనివర్సిటీని అవమానించడం లేదు. ఇక్కడ నుంచి పట్టా అందుకోవడం నాకు గర్వకారణం. అయితే నేను ఇక్కడి నుంచే నా నిరసన వ్యక్తం చేయదలచుకున్నాను అని ఆ యవతి చెప్పినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. మంగళవారం ఈ స్నాతకోత్సవం జరిగింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఈ స్నాతకోత్సవానికి రాగా సిఎఎని సమర్ధించినందుకు గాను విద్యార్ధులు ఆయనను అడ్డుకున్నారు. దానితో గవర్నర్ స్నాతకోత్సవంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు.