కాబూల్: ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్లోని షాదారక్ ప్రాంతంలో భారీ కారు బాంబు దాడికి పాల్పడ్డారు. అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలోనే అమెరికా ఎంబసీ కూడా ఉన్నది. భారీ పేలుడు వల్ల పలు వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుకు తామే బాధ్యులమంటూ తాలిబన్ ప్రకటించింది. ఎన్డీఎస్ ప్రాంతానికి వస్తున్న ఓ విదేశీ కాన్వాయ్ని తాలిబన్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎంత మంది మరణించారన్న విషయం ఇంకా తెలియరాలేదు.
రెండు రోజుల క్రితం కాబుల్లోని గ్రీన్ విలేజ్ సమీపంలో పలు అంతర్జాతీయ సంస్థలు నెలకొని ఉన్న నివాస ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. కారులో వచ్చిన దుండగుడు కారుతో సహా తనను తాను పేల్చుకోవడంతో 16 మృతి చెందగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో ఉగ్రదాడికి పాల్పడ్డారు.
https://youtu.be/03Aql5N2zXk