కోల్కతా: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఘనవిజయం దారిలో నడిపించిన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ కార్యస్థానం పశ్చిమ బెంగాల్కు మారుతున్నది. సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో బిజెపి పాగా వేయడంతో కలవరానికి గురైన తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
2014లో రెండు సీట్లలో మాత్రమే విజయం సాధించిన బిజెపి మొన్నటి ఎన్నికలలో రాష్ట్రంలో 18 సీట్లు గెలుచుకున్నది. 34 సీట్లు గెలుచుకున్న తృణమూల్ 22 సీట్లకు దిగజారింది. కోల్కతాలో గురువారం మమతాది ప్రశాంత్ కిషోర్తో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. రానున్న శాసనసభ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించి అందుకు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు.