న్యూయార్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు ఆంటిగ్వా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీని భారత్ కు అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని ఆ దేశ ప్రధాని గాస్టన్ బ్రౌనే తెలిపారు. చోక్సీతో తమ దేశానికి ఎటువంటి విలువ ఉండదని, అతని అప్పీళ్లు అన్నీ ముగిసిన తర్వాత, ఇండియాకు అప్పగిస్తామని వెల్లడించారు. భారతీయ అధికారులు ఎప్పుడైనా వచ్చి చోక్సీని విచారించవచ్చు అని తెలిపారు. ఆర్థిక నేరాలతో ప్రమేయం వున్న వారికి తాము చోటు కల్పించబోమని ప్రధాని గాస్టన్ స్పష్టం చేశారు. ఈ మేరకు న్యూయార్క్ లో ఎయన్ఐ వార్త సంస్థతో గాస్టన్ చెప్పారు.
#WATCH Antigua & Barbuda PM Gaston Browne: Got subsequent information that Mehul Choksi is a crook, he doesn't add value to our country. He will be deported ultimately after he exhausts appeals, Indian officials are free to investigate based on his willingness to participate. pic.twitter.com/FbAaIml0Fv
— ANI (@ANI) September 25, 2019
పీఎన్బీ స్కామ్లో నీరవ్ మోదీతోపాటు చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇద్దరూ వజ్రాల వ్యాపారం పేరుతో పీఎన్బీలో భారీ స్కామ్కు పాల్పడ్డారు. రూ.13,500 కోట్ల కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే ఆయన భారత్ నుంచి పరారై ఆంటిగ్వాలో పౌరసత్వం తీసుకున్నారు. న్యాయపరమైన అన్ని దారులూ మూసుకుపోయిన తర్వాత చోక్సీ పౌరసత్వాన్ని రద్దు ఇటీవల ఆంటిగ్వా ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు నీరవ్ మోదీని మార్చి 20న లండన్లో యూకే పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు పారిపోయిన నీరవ్ను భారత్ తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ కొద్ది నెలలుగా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ మార్చి 9న లండన్లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో మార్చి 20న నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా లండన్ కోర్టు తిరస్కరించింది. ఇదిఇలా ఉంటే ఆరోగ్య సమస్యలున్న కారణంగా తాను భారత్కు తిరిగి రాలేకపోతున్నానని మెహుల్ చోక్సీ బొంబాయి హైకోర్టుకు తెలిపారు. ఇండియాలో తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయం ఉందని, ఆ కారణంగానే ప్రస్తుత పరిస్థితిలో తన చిరునామాను వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
మెహుల్ చోక్సీ గీతాంజలి జ్యూయెలరీస్ అధినేత మాత్రమే కాదు..నీరవ్ మోడికి మేనమామ కూడా! తన బ్రాండ్ అంబాసిడర్లుగా పెద్ద పెద్ద నటీమణులను నియమించుకోవడమే కాకుండా..ఫ్యాషన్ షోలు, బిగ్ టికెట్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుండేవాడు మెహుల్ చోక్సీ..ఇదే స్టైల్ని తర్వాతి కాలంలో నీరవ్ కూడా ఫాలో అయ్యాడు. నీరవ్ మోదీ, అతడి మేనమామ మోహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.13,500 వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ, ఈడీ సంస్థలు వారిపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాయి.
మెహుల్ చోక్సీ సంబంధించిన రూ.24.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత జూలైలో జప్తు చేసింది. దుబాయ్ లోని మూడు వాణిజ్య ఆస్తులతో పాటు ఒక మెర్సెడెన్ బెంజ్ కారు, భారత్ సహా ఇతర దేశాల్లో ఉన్న అతని బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఇప్పటి వరకూ మొత్తం రూ.2,534.7 కోట్లు ఆస్తుల్ని జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.