కేరళ: మర్డర్-2 చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రశాంత్ నారాయణ్ ను కేరళ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. చీటింగ్ కేసు కింద అతన్ని ఈ నెల 4న పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ నిర్మాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రశాంత్ నారాయణ్ పై 420, 406 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రశాంత్ నారాయణ్ తోపాటు ఆయన భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను కేరళలోని తలసరీ జైలుకు తరలించారు.
previous post
next post