పాత ఫొటోతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం
‘‘వెయ్యి మాటల కంటే ఒక చిత్రం ఎక్కువ చెబుతుంది. మమతా బెనర్జీ తన తల్లి మతమైన ఇస్లాం పుచ్చుకున్నారు. ఆ విషయం ఈ ఫొటోతో స్పష్టమవుతుంది. జ్యోతి బసుకు ఆమె ఆదాబ్ చెబుతున్నారు. ఇస్లామిక్ చరిత్రలోనే ఆమె పీజీ చేశారు. ఆమె హిందూ వ్యతిరేకి, హిందువులకు వ్యతిరేకంగా ఆమెమాట్లాడే తీరు ఇస్లాంపై ఆమె అభిమానాన్ని చాటుతాయి’’ అని ఒక ఫొటోతో పాటు పెట్టారు. అందులుో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాజీ సీఎం జ్యోతిబసును పలకరిస్తున్నట్లుంది. ఈ ఫొటో, ఆ కేప్షన్ కలిపి సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి. చాలామంది సోషల్ మీడియా యూజర్లు ఆమె ఫొటోను ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలలో అదే చెబుతూ షేర్ చేస్తున్నారు.
వాస్తవాలు ఇవీ..
గూగుల్ రివర్స్ ఇమేజి సాయంతో ఫొటో ఏంటా అని చూస్తే, టైమ్స్ కంటెంట్ వెబ్ సైటులో ఆ ఫొటోను పెట్టారు. దానికి వాళ్లు పెట్టిన కేప్షన్ ఇలా ఉంది. ‘‘కేంద్ర యువజన, క్రీడల శాఖ సహాయ మంత్రి మమతా బెనర్జీ పశ్చి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసుకు అభివాదం చేస్తున్న దృశ్యం 1991 జులై 1న కలకత్తాలోని రైటర్స్ బిల్డింగులో ఆయన ఆమెకు ‘నమస్కారం’ చేశారు’’.
సోషల్ మీడియా ఏమంటోంది..
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలో మమతా బెనర్జీ.. జ్యోతిబసుకు ఆదాబ్ ను సూచించేలా నమస్కరిస్తున్నారని ఉంది. సాధారణంగా ముస్లింలే అలా చేస్తారు. దాన్ని బట్టి సోషల్ మీడియా రెండు రకాలుగా చెబుతోంది. 1. మమతా బెనర్జీ తల్లి ముస్లిం. ఆమె మతాన్నే మమత కూడా తీసుకున్నారు. 2. మమత ఇస్లామిక్ చరిత్రలో పీజీ చేశారు. వీటిలో రెండోది పూర్తిగా వాస్తవమే. అందుకు పత్రసహిత ఆధారాలు కూడా ఉన్నాయి.
కానీ మమత తల్లి ముస్లిం అన్నమాట మాత్రం పూర్తి అబద్ధం. ఆమె తల్లి గాయత్రీ దేవి 81 ఏళ్ల వయసులో 2011 డిసెంబరు 17న మరణించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తాము పెద్దగా స్పందించబోమని టీఎంసీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. మమతా బెనర్జీ జీవిత చరిత్ర రాస్తున్న శుతప పాల్ కూడా దీనిపై మాట్లాడారు. ‘‘మమతా బెనర్జీ ముస్లిం అన్న విషయం నా పరిశోధనలో ఎక్కడా రాలేదు. ఆమె ప్రతియేటా కాళికా మాతకు పూజచేయడాన్ని బట్టే ఆమెది ఏమతమో తెలుస్తుంది. బెనర్జీల ఇళ్లలో చాలా కాలం నుంచి ఈ పూజచేస్తారు. ఆమె వ్యక్తిగతంగా ప్రతి సంవత్సరం కాళీ పూజ చేస్తారు, దానికి క్రీడలు, రాజకీయాలు, సినిమా, వ్యాపార ప్రపంచాల నుంచి చాలామంది వస్తారు. ఆమె ర్యాలీలలో శ్లోకాలు వల్లిస్తారు, చండీపథం కూడా చెబుతారు. ఆమె చదివిన స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి అక్కడ టీచర్లతోనూ మాట్లాడాను. ఆమె ముస్లిం అని ఎవరూ చెప్పలేదు’’ అని ఆయన తెలిపారు.
ఇక మమతా బెనర్జీ తల్లి గాయత్రీదేవి 2011లో మరణించినపుడు ఆమె అంత్యక్రియలు కూడా హిందూ సంప్రదాయాల ప్రకారమే చేశారు. ఈ విషయం 2011 డిసెంబరు 17న ద హిందూ పత్రికలో ప్రచురించారు. అయినా పాత ఫొటోను పట్టుకుని మమతా బెనర్జీ ముస్లిం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
(ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో)