న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో యూరోపియన్ సమాఖ్య దేశాలకు చెందిన ఎంపిల బృందం పర్యటిస్తుండటంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు.
‘కశ్మీర్లో పర్యటించడానికి, ఆ విషయంపై జోక్యం చేసుకోవడానికి యూరోపియన్ ఎంపిలకు అనుమతి ఇస్తున్నారు. భారత్కు చెందిన ఎంపిలు, నాయకులను మాత్రం విమానాశ్రయాల నుండే వెనక్కి పంపిచేస్తున్నారు. ఇటువంటి అపూర్వమైన జాతీయవాదం వారిది’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.
జమ్మూకశ్మీర్లో మానహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్ ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ఈయూ ఎంపిలు అధ్యయనం చేస్తారు.
దేశంలోని ఎంపిలకు అనుమతి ఇవ్వకుండా, ఈయూ ఎంపిలకు అనుమతి ఇచ్చారని నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా విమర్శించారు.
कश्मीर में यूरोपियन सांसदों को सैर-सपाटा और हस्तक्षेप की इजाजत लेकिन भारतीय सांसदों और नेताओं को पहुँचते ही हवाई अड्डे से वापस भेजा गया!
बड़ा अनोखा राष्ट्रवाद है यह।https://t.co/hAHVigzGFU
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 29, 2019