(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. స్విట్జర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ పోటీల్లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధుకు ఇది మూడోసారి. ఈ రోజు జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యు ఫైను 21-7, 21-14 పాయింట్ల తేడాతో సింధు ఓడించింది. 40 నిమిషాల్లోనే ఈ గేమ్ పూర్తయింది. ఆదివారం జరిగే తుదిపోరులో రచనోక్ లేదా ఒకుహరాతో సింధు తలపడనుంది. గత రెండు సీజన్లలోనూ ఇదే టోర్నీలో వెండి పతకాల సాధించింది సింధు.