(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీలో 49 సంవవత్సరాల క్రితం తాను భూమ్మీద పడ్డపుడు పక్కనే ఉన్న నర్సును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం వయనాడ్లో కలుసుకున్నారు. అప్పట్లో దేశ రాజధానిలో నర్సుగా పనిచేసిన రాజమ్మ రాజప్పన్ పదవీ విరమణ తర్వాత వయనాడ్లో ఉంటున్నారు.
రాహుల్ గాందీ వయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మూడు రోజులుగా వయనాడ్లో పర్యటిస్తున్న రాహుల్ చివరిరోజున రాజమ్మను కలిశారు. ఆమెను రాహుల్ హత్తుకున్న ఫొటోను రాహుల్ వయనాడ్ కార్యాలయం ట్విట్టర్లో పోస్టు చేసింది.
మూడు రోజులుగా పర్యటనల్లో రోడ్షోలు నిర్వహిస్తున్న రాహుల్ ప్రధాని మోదిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మెదీ ఎన్నికల ప్రచారం అంతా అసత్యాలు, విషం, విద్వేషంతో నిడిపోయిందనీ, కాంగ్రెస్ సత్యం, ప్రేమల కోసం నిలబడిందనీ ఆయన ఒకచోట అన్నారు. దారిలో ఒకచోట ఆయన రోడ్డుపక్క హోటల్లో టిపిన్ తిని టీ తాగారు.
As CP @RahulGandhi's third day begins, he shares a light moment with Rajamma, a retired nurse present at the time of his birth.#RahulGandhiWayanad pic.twitter.com/MxvqYJEfRz
— Rahul Gandhi – Wayanad (@RGWayanadOffice) June 9, 2019