(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిన రాణు మండల్.. తాను పాడిన పాటను మరచిపోయింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాణు మండల్ను యాంకర్ తమ కోసం ఓ పాట పాడాలని కోరింది. దానికి సరే అని తల ఊపుతూ హిమేష్ జీ పాట పాడనా ? అంటూ రాణు మండల్ స్టేజ్పై నిలబడింది. అయితే, కాసేపటికి ‘ ఓ మై గాడ్ ఐ ఫర్ గెట్ సాంగ్’ అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
https://www.instagram.com/p/B5dtBR4nvCD/?utm_source=ig_embed
కాగా, బెంగాల్ లోని ఓ రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేసుకునే రాణు మండల్.. ‘ఏక్ ప్యార్ క నగ్మా హై’ పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఇంటర్ నెట్ సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె గాత్రం లతా మంగేష్కర్ను పోలి ఉండటంతో ఆమెకి నెటిజన్లు ఫిదా అయ్యారు. బాలీవుడ్ సినిమాల్లో పాటలు కూడా పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘తేరీ మేరీ కహాని’ అంటూ రాణు పాడిన కూడా సెన్సెషన్ అయ్యింది. ఆమె పలు కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.