(న్యూస్ అర్బిట్ డెస్క్)
తెలుగుభాష ప్రాముఖ్యతను గురించి ప్రముఖ తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన భావాలను పాట రూపంలో వినిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాతృభాషాభివృద్ధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందనీ అందుకే తాను పవన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చాననీ ఆయన పేర్కొన్నారు. 30 ఏళ్లు గా రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు ఏవీ తెలుగు బాషాభివృద్ధికి చర్యలు తీసుకోలేదని జొన్నవిత్తుల అన్నారు. పుట్టిన బిడ్డకు మాతృభాషలోనే అన్ని విషయాలు అర్థమయ్యేలా తల్లి చెబుతుంది కాబట్టి మాతృభాషే గొప్పదని ఆయన తెలిపారు. ఇంగ్లీషు కేవలం ఓ భాష మాత్రమే కాబట్టి దాన్ని ఆరవ తరగతి నుండి నేర్పించవచ్చునని ఆయన పాటలో సూచించారు.
మాతృభాషను బ్రతికించుకోవడం కోసం ఉద్యమిస్తానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అద్భుతంగా పాడిన కవి శ్రీ జొన్నవిత్తుల గారు.#OurRiversOurMotherTongue#మననుడి_మననది#JSPForNewAgePolitics pic.twitter.com/gxTSOeHcB6
— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 1, 2019