రాయబరేలి (ఉత్తర్ప్రదేశ్) : యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం రాయబరేలి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయకముందు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి కుమారుడు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంగ గాంధీ వద్రా, ఆమె పిల్లలు రైహన్, మీర్యాలతో కలిసి రాయబరేలిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని.. ఆయనకు ప్రజలు బుద్ధి చెపుతారని సోనియా పేర్కొన్నారు. 2004లో వాజపేయికి ఎదురైన పరాభవమే మోదీకి తప్పదని సోనియా వ్యాఖ్యానించారు.