(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. నేర చరితులను చేర్చుకున్న రాజకీయ పార్టీలకు ఇది నిజంగా చేదు వార్త. నేర చరిత్ర కల్గి ఉన్న రాజకీయ పార్టీలు తమ వెబ్సైట్లలో ఆ కళంకిత నేతలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 48 గంటల్లోనే వారి వివరాలను వెబ్సైట్లలో పెట్టాలని నేడు ఆదేశించింది. ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు వారిపై ఉన్నాయి, వారిని ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు అన్న విషయాలను తమ తమ వెబ్సైట్లలో పొందుపరచాలని ఉన్నత ధర్మాసనం తన తీర్పులో ఆదేశించింది.
రాజకీయాలలో నేర చరితులు పెరుగుతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.