(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్లోని సూరత్ నగరంలో కొంతమంది యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా జరిగిన రాస్ గర్బా సందర్భంగా కొంతమంది యువతులు తమ వీపుపై అందరికీ కనిపించే విధంగా వివిధ టాటూలు వేయించుకున్నారు.
Surat(Gujarat): Women pose with body paint tattoos during preparations for #Navratri and Raas Garba, yesterday pic.twitter.com/VeUnWQjjF5
— ANI (@ANI) September 29, 2019
వీరిలో ఓ యువతి కొంచెం వెరైటీగా ఆలోచించి చంద్రయాన్ 2, మరో యువతి ఆర్టికల్ 370 , అదే విధంగా రోడ్ సేఫ్టీ వంటి చిత్రాలను టాటూలుగా వేయించుకుంది.
మరో యువతి తన వీపుపై మోదీ, ట్రంప్ ఫొటోలను పచ్చబొట్టు పొడిపించుకుని అభిమానాన్ని చాటుకుంది. ఆ ఫొటోలపైన ‘హౌడీ-మోదీ’ అని రాయించుకుంది. ప్రస్తుతం వీరు వేయించుకున్న టాటూలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.