మెగాభిమానులు, ప్రేక్షకలు ఆసక్తిగా ఎదురు చూసిన సైరా నరసింహారెడ్డి ట్రైలర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రమిది. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ ఎలిమెంట్స్తో ఈ ట్రైలర్ను కట్ చేశారు. అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్వారికి శిస్తు కట్టకుండా చేసిన పోరాటం.. ఆయనకు ప్రజలు అందించిన సహకారం. ప్రజల్ని బ్రిటీష్వారు హింసించి చంపేసిన సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిత్రీకరించారు.
`నరసింహారెడ్డి సామాన్యుడు కాడు.. అతడొక కారణజన్ముడు`.. `అతనొక యోగి.. యోధుడు.. అతడినెవ్వరూ ఆపలేరు` అంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్పతనాన్ని ట్రైలర్ హైలైట్ చేస్తుంది.
`ఈ భూమిలో పుట్టింది మేము.. భూమిలో కలిసేది మేము.. మీకెందుకు కట్టాలిరా శిస్తు?` అని నరసింహారెడ్డి బ్రిటీష్ వారిని ఎదిరించే సన్నివేశాలు.. అలాగే కిచ్చా సుదీప్.. తమిళ నాయకుడిగా విజయ్ సేతుపతి నరసింహారెడ్డికి అండగా నిలబడటం.. వారు కలిసి చేసే యుద్ధ సన్నివేశాలు. తమన్నా, నయనతార, చిరంజీవి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి.
`స్వాతంత్ర్యం కోసం నువ్వు చేస్తున్న యుద్ధం… నువ్వు గెలవాలి` అంటూ గోసాయి ఎంకన్ననరసింహారెడ్డిని ఇన్స్పైర్ చేసే విధానం అన్ని ట్రైలర్లో ఆవిష్కరించారు. ట్రైలర్ చివరలో ..స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు..నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా.. నా దేశం వదిలి వెళ్లిపోండి లేదా.. యుద్ధమే`
చివరి కోరికేమైనా ఉంటే ఓ వాక్యంలో చెప్పు అని అడిగితే `గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ ` అంటూ నరసింహారెడ్డి పాత్రధారిగా చిరంజీవి చెప్పే డైలాగ్తో ట్రైలర్ ముగిసింది. ప్రతి సీన్ చాలా రిచ్గా అద్భుతంగా ఉంది. రత్నవేలు కెమెరా పనితనం.. అమిత్ త్రివేది సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ హైలైట్గా ఉన్నాయి.
ఈ ట్రైలర్తో సైరా నరసింహారెడ్డిపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అక్టోబర్ 2న సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
previous post
next post