విశాఖ, మార్చి 31: విశాఖలో నేటి సాయంత్రం జరిగే టిడిపి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్లొంటున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టిడిపి ఆదివారం విశాఖ నగరంలోని ఇందిరాప్రియదర్శని మున్సిపల్ క్రీడామైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది.
ఈ సభలో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్లొంటున్నారు.
బహిరంగ సభ ఏర్పాట్లను విశాఖ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ నేతలతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సుమారు 60వేల మందికిపైగా ఈ సభకు హజరవుతారని టిడిపి వర్గాల అంచనా.