NewsOrbit
టాప్ స్టోరీస్

వైఎస్ జగన్మోహన రెడ్డి అనే నేను..!

 

అమరావతి: నవ్యాంధ ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నర్శింహన్ జగన్మోహనరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.

వైఎస్..జగన్మోహన్ రెడ్డి అనే నేను..ముఖ్యమంత్రిగా  అంటూ..దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయగా అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారు. సిఎం, సిఎం అన్న అభిమానుల నినాదంతో స్టేడియం హోరెత్తిపోయింది.

‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము, విధేయతా చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్నీ, సమగ్రతను కాపాడుతాననీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాననీ, భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాననీ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని జగన్ పేర్కొన్నారు.

తరువాత  ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచననీ లేదా వెల్లడించననీ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ  సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి, కుమార్తెలు, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, డిఎంకె నేత స్టాలిన్, యానాం ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు, తెలంగాణ  అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ శాఖ మంత్రి మహబూబ్ ఆలీ, టిఆర్‍‌ఎస్ నేత కె.కేశవరావు,  మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, వామపక్షాల నేతలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, పలు రాష్ట్రాల ప్రముఖులు వేదికపై ఆశీనులు కాగా పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం అయిన వెంటనే సర్వమత ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలు జగన్మోహనరెడ్డిని ఆశీర్వదించారు.

ముందుగా జగన్మోహనరెడ్డి టాపులేని జీపులో వేదిక చుట్టూ తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. జగన్మోహనరెడ్డి సభాస్థలికి రాగానే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో  హెలికాఫ్టర్‌తో పూలు చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment