చెన్నైః దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించినట్లు వెల్లడించాయి. ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని వీరు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దాడులకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నై, కొయంబత్తూర్తో పాటు ప్రధాన ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. చెన్నైలో బలగాలను పెంచారు. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్, బస్స్టాండ్, థియేటర్లు, షాపింగ్మాల్స్ ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
ఇటీవలే తమిళనాడులో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. గడిచిన ఐదు నెలల కలంలో చెన్నై, మధురై, రామనాథపురం, తిరునల్వేలి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి దాదాపు 10 మంది అనుమానితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
previous post